
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోగల అరవపల్లె గాంధీ నగర్ కు వెళ్లే రహదారి దాదాపు వారం నుంచి అంధకారంలో ఉంది.కటిక చీకటి గా ఉంది, పాదచారులకు ఇబ్బంది గా ఉంది పంచాయతీ సిబ్బందికి ఈ విషయము ఎంపీడీవో చరవాణి ద్వారా పంచాయతీ సిబ్బందికి తెలియజేసిన పట్టించుకున్న దాఖలాలు లేవు, వారం రోజులుగా అంధకారంలో ఉన్న వీధిని పట్టించుకోకపోవడం ఏంటని స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.