
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 17వ తేదీన రాజంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని చారవాణి ద్వారా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పల్లేటి రామసుబ్బా రెడ్డి రాజంపేట తాలూకా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాలూకా కమిటీ సభ్యులు ఐకమత్యంతో కలిసి మెలిసి యూనియన్ బలోపే తానికి పనిచేయాలన్నారు. కార్య క్రమాలు నిర్వహించేటప్పుడు కమిటీ సభ్యులకు ముందుగా సమా చారాన్ని అందించాలని తెలియ జేశారు. కమిటీ సభ్యులు సమిష్టిగా పనిచేసే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ కార్య క్రమంలో ఏపీయూడ బ్ల్యూజే ప్రతినిధులు పాల్గొ న్నారు.