
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 19. 10 తరగతి 2026 పబ్లిక్ పరీక్ష ఫలితాలలో పాఠశాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించినవిద్యార్థుల కు నగదు బహుమతులను అందించారు. కీర్తిశేషులు షేక్ ఖాసిం వలి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుల జ్ఞాపకార్థం వారి కుమారుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతగుంట్ల నందు గణిత ఉపాధ్యాయినిగా పనిచేయుచున్న షేక్ యూసుఫ్ షరీఫ్ 3000 రూపాయలను (మూడు వేలు ) బహుమతిగా అందించారు. పాఠశాల టాపర్ కె. దివ్య కు 2000/- నగదు, తెలుగు నందు అత్యధిక మార్కులు సాధించి ఈర్ల శివాజీకి ఒక వెయ్యి రూపాయల నగదు బహుమతిని అందించారు.
పాఠశాల పూర్వ విద్యార్థులు 1979- 80 బ్యాచ్ వారు దోగిపర్తి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో 3 వేల రూపాయల ను లెక్కలు నందు 100% సాధించినందుకు ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి 1000 చొప్పున నగదు బహుమతులను అందించారు. లెక్కల సబ్జెక్టు నందు 100% ఫలితాలు సాధించిన కె.దివ్య,ఎం మణీ శ్వరి, బి వెంకట శివాజీకి మొత్తం మూడు వేల రూపాయలను ప్రోత్సాహక బహుమతిగా అందించారు.రిటైర్డ్ తహసిల్దార్ శ్రీ మోదాల నాగ మల్లికార్జున రావు గారు పాఠశాలలో ఇంగ్లీష్ సబ్జెక్టు నందు అధిక మార్కులు సాధించినందుకు ఎస్ వి మహేష్ కు2 వేల రూపాయల నగదు బహుమతిని అందించారు. ఈ విధంగా పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో అధిక ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతు లను అందించిన దాతలకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు.