

ఏర్గట్ల, జూలై 24: ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్లో శుక్రవారం నిర్వహించిన సర్ ఓటర్ నమోదు ప్రక్రియ సమీక్ష సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ సర్ ఇంచార్జ్ వరప్రసాద్ పాల్గొని బి ఎల్ ఏ లకు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏర్గట్ల మండలంలో సర్ ఓటర్ నమోదు ప్రక్రియ 100 శాతం పూర్తయిందని తెలిపారు. అయితే డెత్, షిఫ్టింగ్, డబుల్ ఓట్లను మరోసారి ఇంటింటికీ వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరారు.అలాగే ఈ రోజు నుంచి కొత్తగా అర్హత పొందిన ఓటర్లను గుర్తించి ఫారం-6 ద్వారా నమోదు చేయాలని, ఒక్క అర్హ ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని బి ఎల్ ఏ లకు సూచించారు.అనంతరం వరప్రసాద్ను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్, మాజీ అధ్యక్షుడు సోమ దేవరెడ్డి, గుమ్మిర్యాల్, తడ్పకల్ నాగేంద్రనగర్ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు కిషోర్, జాకీర్, రఘుపతి, రాకేష్, దోంచందా లింగారెడ్డి, మల్లారెడ్డి, తోర్తి దానం మోహన్, ముత్తెన్న, సాయి, అజయ్, సలీం, అరుణ్, రాజు, దేవన్న, నందు, గంగా భూమన్న, హరీష్, మండల బి ఎల్ ఏ లు, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.