
జనం న్యూస్, జూలై 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాదె శివ చౌదరి నూతన గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ హాజరై నూతన గృహంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గాదె శివ చౌదరి దంపతులను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. కొత్త ఇంటిలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు నెలకొనాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, సంధ్య, హరి ప్రసాద్, నవీన్, బాలరాజు, రాము, అరుణ్, రామారావు, సుజాత, వాణి, బర్కత్, అలీ, అక్బర్, వరుణ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొని గాదె శివ చౌదరి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.