
జనం న్యూస్ 25జూన్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో సర్పంచ్ వెలమ బలరాం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా డీపీడీ ఆత్మ ఎం. జాన్ సుధాకర్ హాజరై రైతులకుపంటలోఎరువులసమతుల్యత, ప్రభుత్వం సూచించ 7 వరి రకాల ప్రాముఖ్యత మరియు వాటిలో తీసుకోవాల్సిన మెళుకువలను, నానో ఎరువుల వినియోగం, పంటల పై అధిక రసాయనాలు వాడకుండా అవసరం మేర వాడాలని, పచ్చిరొట్ట విత్తనముల ప్రాముఖ్యత, సేంద్రియ వ్యవసాయం పై అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ఏఈఓ అశ్విని, ఉప సర్పంచ్ తిరుపతి మరియు రైతులు పాల్గొన్నారు.