
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 06-06-26 కేంద్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో మార్చి 24 న 2026 సంవత్సరం ప్రపంచ టీబీ డే సందర్బంగా,టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా నందలూరు మండలంలో 8-6-2026 నుండి 12-6-2026 వరకు గ్రామాలలో 104 వాహనం ద్వారా గ్రామాల్లో నిర్వహించే ఆరోగ్య సేవలు నిర్వహించే గ్రామాలలో టీబీ లక్షణాలు వుండే ప్రతి మనిషికి అక్కడే ఎక్షరే ఉచితం గా తీయబడును. కావున నందలూరు గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని నందలూరు మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యధికారి డాక్టర్ కె. శరత్ కమల్ ఈ సందర్భంలో విన్నవించడమైనది . ఈ ఎక్షరే వేరే ఊరు వెళ్లి తీసుకోవాలంటే దాదాపు అయిదు వందల రూపాయలు వరకు ఖర్చు అవుతుంది. ఈ సదావకాశం నందలూరు ప్రజలు వదులుకోవద్దని తెలిపిరి. మరియు గ్రామాలలో విధులు నిర్వంచే ఆరోగ్య సేవకులు ఆశా, ఆరోగ్య కార్యకర్తలు మరియు ఎమ్ ఎల్ హెచ్ పి లు ప్రజలను చైతన్యపరచవలెనని ఆదేశించారు.104 వాహనం ద్వారా ఆరోగ్య సేవలు అందించే గ్రామాలు (ఎక్సరే తీసే గ్రామాలు ):8-6-2026 న నాగిరెడ్డిపల్లె -1 గ్రామ సచివాలయం పరిధిలో 9-6-2026 న నాగిరెడ్డిపల్లె -2 గ్రామ సచివాలయం పరిధిలో 10-6-2026 న నందలూరు గ్రామ సచివాలయం పరిధిలో 11-6-2026 న టంగుటూరు గ్రామ సచివాలయం పరిధిలో 12-6-2026 న కూడా టంగుటూరు గ్రామ సచివాలయం పరిధిలో