

జనం న్యూస్.. తర్లుపాడు మండలం. ఆగస్టు. 6 తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లి గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మీదేవిమాట్లాడుతూ, తల్లి పాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన శ్రేష్ఠమైన ఆహారమని తెలిపారు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా అవసరమైన పోషకాలు, రోగనిరోధక శక్తి లభిస్తాయని వివరించారు. అలాగే గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకుంటూ తమ ఆరోగ్యంతో పాటు శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, గర్భిణులు, బాలింతలు పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యత, పోషకాహారం అవసరంపై అవగాహన పొందారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.