
బిచ్కుంద జూన్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పరిధిలోని మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జాతీయ నూనె గింజల మిషన్ పథకంలో భాగంగా జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు చే రాయితీపై సోయాబీన్ విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. నూనె గింజల పంటలకు ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ నూనె గింజల మిషన్ పథకంలో భాగంగా రాయితీపై సోయాబీన్ విత్తనాలను మండలంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘం రైతులకు కేటాయించడం జరిగింది. ఈ రాయితీ విత్తనాలను ఎమ్మెల్యే బిచ్కుంద రైతు ఉత్పత్తిదారుల సంఘం రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ మోహన్ రెడ్డి , బిచ్కుంద మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ , సహాయ వ్యవసాయ సంచాలకులు అమర్ ప్రసాద్, బిచ్కుంద రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ శంకర్ , బిచ్కుంద మున్సిపాలిటీ కౌన్సిలర్లు, నాయకులు విట్టల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.