
జనం న్యూస్ జూలై 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సమాజ సేవే లక్ష్యంగా బాలాజీ నగర్ లయన్స్ క్లబ్ ఆఫ్ కూకట్పల్లి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ యక్కంటి వెంకటరెడ్డి స్వయంగా పాల్గొని కార్మికులకు కూరగాయలను అందజేశారు.ఈ సందర్భంగా లయన్ యక్కంటి వెంకటరెడ్డి మాట్లాడుతూ, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ అంకితభావంతో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఎండా, వానా అనే తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం వారు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.ఇలాంటి సేవా దృక్పథం కలిగిన కార్మికులకు తన వంతు సహాయంగా కూరగాయలను అందించడం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో కూడా సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.