

జుక్కల్ సెప్టెంబర్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.బీఆర్ఎస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గ నాయకులు హన్మంత్ షిండే గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకే ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని నాయకులు తెలిపారు.“మోసపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి” అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు.ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.ప్రజల హక్కుల కోసం పోరాటం…ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమం…కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన కొనసాగుతుంది!