
జనం న్యూస్, జూలై 13, జగిత్యాల జిల్లా మెట్పల్లి: పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష పండితులు, జ్యోతిష విశ్లేషకులు బ్రహ్మశ్రీ తిప్పర్తి వెంకటేశ్వర్లు జ్యోతిష రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, విశేష ప్రజ్ఞ కనబరుస్తున్నందుకు ప్రతిష్ఠాత్మకమైన "జ్యోతిష శికామణి" బిరుదుతో ఘనంగా సత్కరించబడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చీరాల పట్టణంలో ఈశ్వర నారాయణ ఆస్ట్రో రీసెర్చ్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వైభవోపేత కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన జ్యోతిష పండితులు, వేద పండితులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, విద్యావేత్తల సమక్షంలో తిప్పర్తి వెంకటేశ్వర్లకు ఈ ప్రతిష్ఠాత్మక బిరుదును ప్రదానం చేశారు. అనంతరం శాలువా కప్పి, జ్ఞాపిక (మెమెంటో) అందజేసి ఘనంగా సన్మానించారు.బ్రహ్మశ్రీ తిప్పర్తి వెంకటేశ్వర్లు చిన్ననాటి నుంచే జ్యోతిష శాస్త్రంపై ప్రత్యేక ఆసక్తి పెంపొందించుకుని శ్రీ ఈశ్వరి మాత బోధన ఆలయంలో జ్యోతిష విద్యను అభ్యసించారు. అనంతరం జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్, సికింద్రాబాద్లో ఉన్నత స్థాయి శిక్షణ పొందడంతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో జ్యోతిష శాస్త్రంలో డబుల్ ఎం.ఏ. పట్టాలు సాధించి తన విద్యా ప్రావీణ్యాన్ని చాటుకున్నారు.జ్యోతిష విశ్లేషణ, జాతక పరిశీలన, గ్రహస్థితుల అధ్యయనం, వాస్తు, ముహూర్త నిర్ణయాలు వంటి పలు విభాగాల్లో ఆయన అందిస్తున్న సేవలు విశేష ఆదరణ పొందుతున్నాయి. శాస్త్రీయ దృక్పథంతో, సాంప్రదాయ జ్యోతిష సూత్రాలను సమన్వయం చేస్తూ ప్రజలకు మార్గనిర్దేశనం చేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ కృషికి గుర్తింపుగానే ఆయనకు "జ్యోతిష శికామణి" బిరుదును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు మాట్లాడుతూ, తిప్పర్తి వెంకటేశ్వర్లు జ్యోతిష రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు. మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి బిరుదులు, పురస్కారాలు అందుకుని మెట్పల్లి పట్టణానికి మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకు రావాలని అభిలషించారు.ఈ పురస్కారం మెట్పల్లి పట్టణానికి గర్వకారణమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ, బ్రహ్మశ్రీ తిప్పర్తి వెంకటేశ్వర్ల సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.