
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా కడప జిల్లా నందలూరు మండలంలోని సెయింట్ జోసెఫ్ క్యాథలిక్ చర్చిలో కపుల్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రెవ రెండ్ ఫాదర్ ఎస్. జనార్ధన్ పాల్గొని, భార్యాభర్తల మధ్య దేవుని ప్రేమ, పరస్పర గౌరవం, విశ్వాసం ఎలా ఉండాలనే అంశాలపై విశ్వాసులకు అవగాహన కల్పించారు. ఈ కార్య క్రమంలో రెవరెండ్ ఫాదర్ తలారి రమేష్, సి.ఎం.సి. సిస్టర్స్, కమిటీ సభ్యులు శౌరి, ధర భాస్కర్, జోసెఫ్తో పాటు పలు వురు విశ్వాసులు పాల్గొన్నారు.