
జనం న్యూస్- మే 20- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపల్ కమిషనర్ గా కే రవీందర్ రెడ్డి ఈరోజు అదనపు బాధ్యతలు స్వీకరించారు, ప్రస్తుతం నందికొండ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న అశోక్ రెడ్డి నెలరోజుల పాటు సెలవులపై వెళ్లడంతోప్రస్తుతం హాలియా మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న కే రవీందర్ రెడ్డి కి నందికొండ మున్సిపల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు, ఆయనకు నందికొండ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు.