
జనం న్యూస్ ఆగస్టు 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్, సాయినగర్, రాజు కాలనీలలో అమ్మవారి తొట్టెలు, గొర్రె పొట్టేళ్ల పలారం బండి ఊరేగింపులు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి.అత్తికారి మల్లేష్, నరేందర్ గౌడ్, ప్రదీప్ రెడ్డి, బండారి నవీన్ ప్రకాష్ గౌడ్, బాలింగ్ రాము ముదిరాజ్ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఊరేగింపుల్లో వివిధ కళాబృందాలు పాల్గొని తమ కళా ప్రదర్శనలతో భక్తులను అలరించాయి.నిర్వాహకుల ఆహ్వానం మేరకు రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఈ ఊరేగింపుల్లో పాల్గొని అమ్మవారి దివ్య దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి వారి కోరిక మేరకు కొద్దిసేపు డప్పుల చప్పులకు లయబద్ధంగా నృత్యం చేసి యువతలో ఉత్సాహాన్ని నింపారు.వడ్డేపల్లి రాజేశ్వరరావు ఊరేగింపులో పాల్గొనడంతో నిర్వాహకులు, భక్తులు ఘన స్వాగతం పలికి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు నిర్వాహకులను అభినందిస్తూ, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.అదేవిధంగా పండుగ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కంచి మహేందర్ యాదవ్, సతీష్ గౌడ్, సురేందర్ రెడ్డి, రమేష్, డాక్టర్ కిరణ్, శ్రీనివాస్, శ్రవణ్ స్థానిక నాయకులు కార్యకర్తలు, నిర్వాహకులు, భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.