
జనం న్యూస్ జులై 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మధుసూదనా చారి వర్గీయులు నిర్వహించిన ప్రెస్ మీట్లో గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు చేస్తున్నారని చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, బాధ్యతారహితమైనవి అని బిఆర్ఎస్ పార్టీ శాయంపేట మండల మాజీ సోషల్ మీడియా ఇన్చార్జి దాసి శ్రావణ్ కుమార్ అన్నారు.ఈరోజు సందర్భంగా వారు మాట్లాడుతూ.మీ నాయకుడే కవిత పార్టీతో, బిజెపి పార్టీలతో సంప్రదింపులు జరుపుకుంటూ, మా నాయకుడిపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. నిజంగా మీ ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగంగా ప్రజల ముందుకు తీసుకురండి. లేకపోతే గండ్ర వెంకట రమణా రెడ్డి కి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి, కాంగ్రెస్ కు ఓట్లు వేసి, బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి కారణమైన వారు ఇప్పుడు తామే నిజమైన ఉద్యమకారులమని, బిఆర్ఎస్ కార్యకర్తలమని చెప్పుకోవడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న కార్యకర్తలు ఎవరో ప్రజలకు బాగా తెలుసు. గత ఏడు సంవత్సరాలుగా గండ్ర వెంకటరమణారెడ్డి గండ్ర జ్యోతి బీఆర్ఎస్ పార్టీలో అంకిత భావంతో పనిచేస్తూ ప్రతి కార్యకర్తకు అండగా నిలిచారు. ప్రజలకు ఎక్కడ ఆపద వచ్చినా ముందుండి సహాయం చేస్తూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారు. అలాంటి నాయకుడిపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ మీటింగ్ పెట్టి భూపాలపల్లి రథసారధి గండ్ర వెంకటరమణారెడ్డి గారే వారి నాయకత్వంలో ముందుకు వెళ్తామని అని చెప్పింది వినబడలేదా,రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి గారే పోటీ చేసి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. భూపాలపల్లిలోనే కాకుండా తెలంగాణలోనే అత్యధిక మెజారిటీ సాధించే నాయకుల్లో ఆయన ఒకరిగా నిలుస్తారు.ఈ కార్యకర్తలు, రైతులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఎవరితో మాట్లాడినా కూడా గండ్ర వెంకటరమణారెడ్డి గారిపై ఉన్న ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల్లో ఉనికి కోసం మీ నాయకుడు చేసే చిల్లర రాజకీయాలు ఇకనైనా మానుకోవాలి.ఈ కార్యక్రమంలో గోవిందపూర్ గ్రామశాఖ మాజీ అధ్యక్షులు నర్ర రాజు, ఉప సర్పంచ్ కలువాల నరేందర్, మండల మాజీ ఉపాధ్యక్షులు సౌల్ల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు….