
జనం న్యూస్ జూన్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మియాపూర్లో నిర్వహించిన శ్రీ సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల పూజా మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. రాచమల్ల కృష్ణ పటేల్ మరియు వారి కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ఈ కార్యక్రమానికి హాజరై అమ్మవార్ల దివ్య ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి రమేష్, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొని ప్రజలందరికీ సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు.ఈ పూజా మహోత్సవంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్, రాచమల్ల ఓం ప్రకాష్ గౌడ్, టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్ల సంజీవ్ రెడ్డి, రామచంద్ర, బాలింగ్ యాదగిరి గౌడ్, వీరేందర్ గౌడ్, కరుణాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, భాస్కర్ గౌడ్, తిరుపతి, తాండ్ర రాంచందర్ గౌడ్, మహేందర్ ముదిరాజ్, రవికుమార్ గౌడ్, వాసు, దినేష్ గౌడ్, గిరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.