
జనం న్యూస్ జూన్ 30 (ముమ్మిడివరం ప్రతినిధి)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాముమ్మిడివరం గ్రామంలోని హనుమంతుడు ఆలయం, చెరువు కట్ట సమీపంలోని ప్రభుత్వ స్థలంలో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. రెండు ట్రాక్టర్లతో నిర్మాణ సామగ్రిని తరలించి, ఒక ఫ్లెక్సీ, ఒక జెండా ఏర్పాటు చేశారు.ఈ విషయాన్ని స్థానిక హిందువులు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ నాయకుడు శిరంగు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే బజరంగ్దళ్ కార్యకర్తల బృందం పరిశీలనకు ముమ్మిడివరం బయలుదేరింది.ఈ సమాచారం తెలుసుకున్న పోలీసు, సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలు చేరుకునేలోపే అధికారులు అక్కడ ఉన్న నిర్మాణ సామగ్రిని, ఫ్లెక్సీలు, జెండాలను తొలగించి సమస్యను పరిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులు ఫోన్ చేసి ఇక్కడ ఎటువంటి సమస్య లేదని, సమస్య పరిష్కారమైందని తెలపడంతో బజరంగ్దళ్ బృందం తమ ఆందోళన కార్యక్రమాన్ని విరమించింది.అక్రమ నిర్మాణానికి యత్నించిన వారిని పిలిచి మాట్లాడారు. హిందూ ఆలయం సమీపంలో ఇటువంటి నిర్మాణాలు చేపడితే గ్రామంలో శాంతి భద్రతలకు సమస్య ఏర్పడుతుందని, రహదారి పక్కన సామగ్రి ఉంచడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వారికి వివరించారు.ఈ సమస్యను వెంటనే పరిష్కరించిన పోలీసు యంత్రాంగానికి, పురపాలక యంత్రాంగానికి, గూఢచారి విభాగానికి విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.