
జనం న్యూస్ 22 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : రైల్వే ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 1989 రైల్వే చట్టాన్ని జన విశ్వాస్ పేరిట సవరించింది. ఈ మారిన చట్టాల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే వారికి రైల్వే రక్షక దళం (ఆర్ పి యాప్ ) ఇకపై అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించనుంది. కాజీపేటలో ఆర్పీఎఫ్ అధికారులు దీనికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. టికెట్ లేని ప్రయాణం మహిళల కోచ్లోకి ప్రవేశించడం ధూమపానం వంటి పలు నేరాలకు జరిమానాలు భారీగా పెంచారు. ఫైన్ కట్టకుంటే కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపనున్నారు ట్రైన్లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతను పటిష్టం చేయడానికి, స్టేషన్లలో రైళ్లలో క్రమశిక్షణను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రాంగణాల్లో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే ధ్యేయంగా దశాబ్దాల నాటి 1989 రైల్వే చట్టంలో విప్లవాత్మక మార్పులు చేస్తూ సవరణలు తీసుకువచ్చింది. జన విశ్వాస్ పేరిట ప్రవేశపెట్టిన ఈ నూతన చట్ట సవరణల ద్వారా రైల్వే రక్షక దళానికి (ఆర్ పి యాప్ ) అపరిమితమైన అధికారాలను కల్పించారు. గతంలో ఆర్పీఎఫ్ అధికారులకు నేరుగా జరిమానాలు వసూలు చేసే అధికారం ఉండేది కాదు. కానీ మారిన నిబంధనల ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచే ఆర్పీఎఫ్ సిబ్బంది తప్పు చేసిన వారికి అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించేలా చట్టాన్ని మార్చారు