
జనం న్యూస్ మే 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పి ఏ సి చైర్మన్ విచ్చేసి రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు ఎన్టీఆర్ అభిమానులు రామారావు కి నివాళులు అర్పించారు అభిమానుల అందరి సమక్షంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేసి కేకు మిఠాయి అభిమానులకు ఎమ్మెల్యే తినిపియడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్న ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పథకాలు స్థాపించి ప్రజలకు ఎంతో సేవ చేశారు ముఖ్యంగా మహిళలకు ఆస్తి హక్కు ఉచిత బియ్యం మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం మంచినీరు కరెంటు రవాణా సౌకర్యం కల్పించి ప్రజలకు రాజకీయంగా ఉన్నత పదవులు పెంపొందించారు అలాంటి మహనీయుడు నేడు మనలో లేకపోయినా వారు చేసిన అభివృద్ధి పనులు తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నారని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు ఈ కార్యక్రమంలో చంద్రకాంతరావు సంజీవరెడ్డి రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి మల్లయ్య లింగయ్య లక్ష్మీబాయి యాదగిరి వెల్ఫేర్ కమిటీ సభ్యులు శ్రీధర్ సూర్యనారాయణ మూర్తి జి ప్రసాద్ రామ్ రెడ్డి చల్లారావు సునీల్ పటేల్ కిషోర్ గ్రానైట్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ అభిమానులు అందరూ అన్న కి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అభిమానులు అందరికీ పేరుపేరునా జే పురేందర్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు