

-- బాధితుడి మొబైల్తో పాటు మరో మూడు స్మార్ట్ఫోన్లు, బైక్ స్వాధీనం
-- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బిచ్కుంద పోలీసుల విజ్ఞప్తి
బిచ్కుంద జులై 17 జనం న్యూస్ ; కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద గ్రామానికి చెందిన వ్యాపారి శ్రీ షేక్ షాదుల్ తన రాయల్ వెల్డింగ్ షాప్కు తాళం వేసి వెళ్లగా, 15.07.2026 రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, షాపులో ఉన్న సుమారు రూ.10,000/- విలువైన వివో (Vivo E-30) మొబైల్ ఫోన్ను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బిచ్కుంద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా బిచ్కుంద ఎస్ఐ జి. రాజు మరియు పోలీసు సిబ్బంది అయ్యప్ప టెంపుల్ ప్రాంతంలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఒక మోటార్సైకిల్పై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా, వారు పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి సుదీర్ఘంగా విచారించగా, తాము ఈ చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు.అరెస్టు చేసిన నిందితులు:A-1) కుంచెపు గౌరి అలియాస్ రవి (32):నివాసం: మియాపూర్, హైదరాబాద్.స్వస్థలం: కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్.ఇతనిపై గతంలో షాబాద్, చౌదరిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయి.A-2) మురళి ప్రధాన్ (32):నివాసం: జాజ్పూర్ జిల్లా, ఒడిశా రాష్ట్రం.ఇతనిపై గతంలో మేదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో నేర చరిత్ర ఉంది.నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తి:బాధితుడికి చెందిన 1 వివో (Vivo) మొబైల్ ఫోన్.ఇతర ప్రాంతాల్లో చోరీ చేసిన 3 స్మార్ట్ఫోన్లు (ఒక వన్ప్లస్, ఒక రియల్మీ, ఒక శామ్సంగ్).దొంగతనాలకు, ప్రయాణానికి ఉపయోగించిన హోండా షైన్ మోటార్సైకిల్ ప్రజలకు బిచ్కుంద పోలీసుల విజ్ఞప్తి ప్రజలు తమ గ్రామాలు, కాలనీలలో కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.ముఖ్యంగా రాత్రి సమయంలో ఇళ్లు, దుకాణాలకు బలమైన తాళాలు వేసుకోవడంతో పాటు, వీలైనంత వరకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.ఏదైనా అనుమానాస్పద పరిస్థితి గమనించినా, అత్యవసర సహాయం అవసరమైనా వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని బిచ్కుంద ఎస్సై రాజు ప్రజలను కోరడమైనది