
జనం.న్యూస్ ; 19 మే బుధవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;సిద్దిపేట, మే 20:డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ అభ్యాసకుల సహాయక కేంద్రం – సిద్దిపేట ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్ మరియు 3వ సంవత్సరం 6వ సెమిస్టర్ సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించనున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ డా. ఎం. శ్రద్ధానందం తెలిపారు. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లాసులు ఈ నెల 22వ తేదీ నుండి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేటలో నిర్వహించబడతాయని పేర్కొన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ మరియు కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లాసులకు కనీసం 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకే ప్రాక్టికల్ పరీక్షలు రాయడానికి అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల డా. బి.ఆర్. అంబేద్కర్ ప్రాంతీయ అభ్యాసకుల సహాయక కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది.