
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా ఆగస్టు 10.నందలూరు మండలం టంగుటూరు జనసేన నాయ కుడు ఈశ్వర్ ద్వారా మోహన్ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల ఆపరేషన్ చేయించు కున్నారు ఈ విషయం జనసేన ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు గురివిగారి వాసుకి తెలియ జేయడంతో వెంటనే ఊటుకూరు మాజీ సర్పంచ్ ఎం.ఎల్ నరసయ్య ద్వారా టీడీపీ ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు తో మాట్లాడి CMRF కి దర ఖాస్తుచేసు కున్నారు.సోమవారం స్థానిక టీడీపీ ఆఫీస్ లో నియోజకవర్గ ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు చేతుల మీదగా బాధితులకు వచ్చిన చెక్కును అందించడం జరిగింది.రాష్ట్రంలో సీఎం సహాయనిధి పేదలకు ఒక్క గొప్ప వరం సీఎం నారా చంద్ర బాబు నాయుడు ,డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతి పేదవాడు ఆరోగ్య వంత మైన జీవితం గడపాలి అని ఆంధ్ర ప్రదేశ్ లోని ఏ ఒక్కరూ కూడా అనారోగ్యంతో బాధ పడకూడదు అని ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్యప్రదేశ్ గా మార్చడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని,దీనిని స్ఫూర్తిగా తీసుకొని రాజంపేటలో నియోజకవర్గ కూటమికి నియోజకవర్గ ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు కూటమి లోని జనసేన, బీజేపీ, టీడీపీ ప్రతి కార్యకర్తకి , నాయకులకి ప్రజలకి అండగా ఉంటూ ఎవరు వచ్చిన ఆప్యాయంగా పలకరిస్తూ అందరికీ మనోధైర్యాన్ని నింపుతున్నారు.ఈ కార్య క్రమంలో నందలూరు మండల టీడీపీ కో క్లస్టర్ ఇంచార్జ్ చుక్క యానాది , మందపల్లి రాజా, జనసేన నాయకులు వై. నవీన్, టీడీపీ నాయకులు కూటమి నాయకులు పాలోగొన్నారు.