
జనం న్యూస్ ఆగస్టు 2: తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; స్నేహం అనేది కేవలం పరిచయం మాత్రమే కాదని, జీవితంలోని ప్రతి సంతోషం, ప్రతి కష్టంలో అండగా నిలిచే అపూర్వమైన అనుబంధమని సీనియర్ జర్నలిస్ట్ చింతకుంట్ల శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన తన మిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కన్నీటి వేళ భుజం ఇచ్చేది, ఆనంద క్షణాల్లో మనసారా నవ్వును పంచుకునేది నిజమైన స్నేహమేనని అన్నారు. రక్త సంబంధం కాకపోయినా హృదయాలను కలిపే బంధమే స్నేహమని పేర్కొన్నారు.జీవిత ప్రయాణంలో ఎంతోమంది పరిచయమవుతారని, అయితే మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేది నిజమైన స్నేహితుడేనని ఆయన తెలిపారు. మన విజయాన్ని తన విజయంగా భావిస్తూ, మన బాధను తన బాధగా మోసే ప్రతి మిత్రుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.తన జీవితంలో భాగమైన ప్రతి స్నేహితుడికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి స్నేహబంధం చిరకాలం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.