జనం న్యూస్ మార్చి 11(నడిగూడెం) నడిగూడెం మండల పరిధిలోని రత్నవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు. విద్యార్థులు కలెక్టర్గా, జిల్లా విద్యాధికారిగా, ప్రధానోపాధ్యాయులుగా, ఉపాధ్యాయులుగా అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు యం. పుల్లయ్య, ఉపాధ్యాయులు కరుణ, రాజశేఖర్, నర్మద, సీఆర్పీ నందిగామ రామారావు,అంగన్వాడీ టీచర్, విద్యార్థులు పాల్గొన్నారు.