జనం న్యూస్, జనవరి 13,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు 11 గంటలకు కలెక్టర్ కాంప్లెక్స్ మీటింగ్ హాల్లో జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగినది .ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత అంజి వర్మ , జిల్లా వ్యాయామ విద్య అధ్యక్ష కార్యదర్శులు వి సురేందర్, డి రమేష్ ,వివిధ సంఘాల నాయకులు యువతీ యువకులు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డి .శంకర్ గోదావరిఖని తదితరులు పాల్గొన్నారు. ఈనెల ఏడవ తారీఖున జరిగిన రాష్ట్రస్థాయి యూత్ ఫెస్టివల్ హైదరాబాద్ లో పాల్గొన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.నేటి యువతీ యువకులు స్వామి వివేకానంద ని స్ఫూర్తిగా తీసుకొని భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలను అలాగే జాతి ఔన్నత్యం కొరకు పాటుపడాలని యువతి యువకులు మహనీయుల స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఏ .సురేష్ జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి, పెద్దపల్లి.