జనం న్యూస్ మార్చి 13 సంగారెడ్డి జిల్లా :హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని గురువారం సాయంత్రం పటాన్ చేరు పోలీస్ స్టేషన్ పరిధిలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు..హోలీ పండుగను పురస్కరించుకొని సబ్ డివిజన్ ప్రజలకు పోలీసు శాఖ తరపున హోళి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రజలందరూ పండుగను ప్రశాంత వాతావరణంలో సంప్రదాయాల నడుమ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించుకోవాలని ఇదే నెలలో రంజాన్ పండగ ఉపవాసాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని, మసీద్ ల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామని డిఎస్పి రవీందర్ రెడ్డి సూచించారు.ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలను నడపడం చేయడం నేరమని పేర్కొన్నారు. సబ్ డివిజన్ ప్రజలు సురక్షితమైన సహజ రంగులను వాడి పండుగను నిర్వహించుకోవాలని, రసాయన రంగులను ఉపయోగించవద్దని పేర్కొన్నారు.యువత హోలీ పండుగ అనంతరం చెరువుల్లో లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని సూచించారు. ముఖ్యంగా యువత తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారికి సరైన పద్ధతి ని తెలియజేయాలని సూచించారు., ఈ కార్యక్రమంలో పటాన్చెరు సీఐ వినాయక రెడ్డి, అమీన్పూర్ సిఐ నరేష్,బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి, ఎస్సైలు ఎస్ఐ లక్ష్మారెడ్డి, గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్ రెడ్డి, జిన్నారం ఎస్సై నాగలక్ష్మి, హత్నూర ఎస్సై సుభాష్ సిబ్బంది ముస్లిం సోదరులు పీస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.