జనం న్యూస్ // మార్చ్ // 15 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, స్కెల్ మరియు విద్యార్థులకు ఉపయోగపడే పలు వస్తువులు అందజేశారు. ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ… చదువుతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని 10 వ తరగతి తోనే భవిష్యత్ కు తొలిమెట్టని అన్నారు. అదే విధంగా పదవ తరగతి లో 100% ఉత్తిర్ణత సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.పదవ పరీక్షల్లో కరీంనగర్ జిల్లాలోనే జమ్మికుంట మండలం అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. అదే విధంగా 10/10 సాధించిన విద్యార్థులకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా బహుమతులు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య,పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్,యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గంగారపు మహేష్ యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు అకినపల్లి శ్యామ్, మెరుగు శ్రీధర్, అమృత శివ, తదితరులు పాల్గొన్నారు.