పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో నీలం అభిమానుల సేవాకార్యక్రమాలు. జనం న్యూస్ మార్చి 15 సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేత, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.పటాన్ చెరు నియోజకవర్గంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో నీలం అభిమానులు బర్త్డే కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకోవడంతో
పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు జరిపించారు. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీలం మధు స్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.అనంతరం జిన్నారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. పటాన్ చెరు పట్టణంలో ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు.పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు మన్నె ప్రశాంత్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు జామెట్రీ బాక్స్, పెన్నులు అందించారు. గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం దాచర్లపల్లి, సిరిసిల్ల జిల్లా మాడేపల్లిలో ఎన్ ఎం ఆర్ అభిమానుల ఆయా అనాధాశ్రమలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ఎంఆర్ అభిమానులు రక్తదానం చేయడంతో పాటు ఆసుపత్రి ఆవరణలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు.
వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు, నీలం అభిమానులు పాల్గొన్నారు..