పుల్లూరు బండ త్రికుటేశ్వరాలయంలో కోటి తలంబ్రాల దీక్ష రామకోటి రామరాజు కృషికి ఘన సన్మానం జనం న్యూస్, మార్చి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) భద్రాచల దేవస్థాన సీతారాముల కల్యానానికి గోటి తలంబ్రాలు అందించాలని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ శ్రీకారం చుట్టింది. గత 26సంవత్సరాల ఆధ్యాత్మిక కృషి, పట్టుదలను గుర్తించి భద్రాచల దేవస్థాన గోటి తలంబ్రాల కార్యక్రమం ముచ్చటగా మూడో సారి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకు 250కిలోల వడ్లను అందించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రామకోటి రామరాజు గ్రామ, గ్రామాన తిరిగి లక్షల మంది భక్తులచే గోటి తలంబ్రాలు ఓలిపిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం నాడు సిద్దిపేట మండలం పుల్లూరు బండ త్రికుటేశ్వర దేవాలయంలో కోటి తలంబ్రాల దీక్ష పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇందులో 100మందికీ పైగా భక్తులు పాల్గొని 3గంటలపాటు రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఓలిచి రామకోటి రామరాజు గారికి అక్కడే అందజేషి రామభక్తిని చాటుకున్నారు. మేము భద్రాచల వెళ్ళలేకున్న మా తలంబ్రాలు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి అద్భుత అవకాశం కల్పించినందుకు ఆలయ నిర్వాహకులు రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు బాలకిషన్, భక్తులు పాల్గొన్నారు.