బెట్టింగ్ లపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది మోసపూరిత ప్రకటనలు, నమ్మి సందేశాలు సందేశాలు ఇతర వివరాలు పంపవద్దు ఆన్లైన్లో డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మవద్దు- జిల్లా ఎస్పీ జనం న్యూస్ మార్చ్18 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో నేటి సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది, ప్రతిఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం, కొన్ని సందర్భాల్లో అవగాహన లోపం వల్ల చాలామంది ప్రజలు, యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు. మోసపూరిత ప్రకటనలు, సందేశాలు చూసి మోసపోతున్నారు, ఆన్లైన్ బెట్టింగులు పెట్టడం, ఆన్లైన్ లో పెయింగ్ గేమ్స్ ఆడటం, గుర్తింపు లేని అంతర్జాల సంస్థల్లో డబ్బు పెట్టుబడుల వల్ల చాలామంది ఆర్థిక నష్టాల బారిన పడుతున్నారని తద్వారా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపినారు. అవగాహన లేక అత్యాశకు పోయి ఆన్లైన్ నందు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా ప్రజలు మోసాలబారిన పడుతున్నారు, బెట్టింగ్ యాప్ లు చాలా ప్రమాదకరమైనవి, వీటిల్లో ఒక్కసారి చిక్కుకుంటే బయటకు రావడం ఇబ్బంది అవుతుంది, యాప్ నిర్వాహకుల నుండి బెదిరింపులు వస్తాయి అన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమలో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కి బానిసలుగా మరి అప్పులపాలపై ప్రాణాలకు మీదకు తెచ్చుకొని విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లున్సర్లు సోషల్ మీడియాలో వీటిని ప్రోత్సహించడం వల్ల యువతలో దీని వ్యసనం పెరుగుతోందని వీటి కట్టడికి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన ,ఆన్లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లు ఆయా యాప్ నిర్వహకుల సూచనల మేరకే ఆపరేట్ చేయబడుతాయని, ఆన్లైన్ గేమింగ్ మాటున ప్రమాదకర మాల్ ప్రాక్టీస్ ఉంటుంది జిల్లాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అక్రమ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రచారాన్ని చేయవద్దని, ఆన్లైన్ బెట్టింగ్ , ఆన్లైన్ గేమ్స్ వలన కలిగే పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.