జనం న్యూస్ జనవరి 13 శాయంపేట మండలంలో అభివృద్ధి సంక్షేమమే ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు మండల కేంద్రంలోని గోవిందా పురం గ్రామంలో మంచి నీటి బావికి 2.20 లక్షల రూపాయలు వ్యయంతో బావి నీటి మోటార్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు అనంతరం మండలంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ..7.03.500 విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఆరోగ్యం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తోందని తెలియజేశారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన అర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఫణి చంద్ర మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి పరకాల ఏఎంసీ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ (బుజ్జన్న) మాజీ జెడ్పిటిసి చల్ల చక్రపాణి మాజీ పరకాల మార్కెట్ వైస్ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి. మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్ కాంగ్రెస్ నాయకులు చిందం రవి చింతల రవిపాల్ మారపేల్లి కట్టయ్య తదితరులు పాల్గొన్నారు....