జనం న్యూస్ 21 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా బడ్జెట్ పత్రాలతో నిరసన తెలిపిన జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మరియు బీఆర్ఎస్వి నాయకులు కచ్చితంగా విద్యా రంగానికి 15% బడ్జెట్ ను కేటాయించాలి.బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గద్వాల జిల్లా కేంద్రం లోని పాలమూరు యూనివర్సిటీ పీజీ సెంటర్ లో బడ్జెట్ పత్రాలతో నిరసన తెల్పిన జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మరియు బీఆర్ఎస్వి నాయకులు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ.. విద్యను పాతాళానికి తొక్కుతున్న రేవంత్ రెడ్డి.అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 7.53 శాతమే అనగా 23108 కోట్ల బడ్జెట్ ను విద్యా రంగానికి కేటాయించడం వల్ల విద్య పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ కాంగ్రెస్ సర్కార్ మన ముందు కనబడుతుంది అని అన్నారు.ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లు విద్యార్థులకు రావాల్సిన బకాయిలు అనగా స్కాలర్షిప్లు గాని ఫీజు రియంబర్స్మెంట్ గాని పెండింగ్లో ఉన్నాయి కానీ నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 23,108 కోట్లు మాత్రమే కేటాయించారు ఈ బడ్జెట్ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సరిపోని పరిస్థితి ఉన్నది.హామీలు మాత్రం గంపేడిచ్చి బడ్జెట్ మాత్రం అరకొర కేటాయించి విద్యా వ్యవస్థను అందా:పాతాళానికి తొక్కడం దుర్మార్గం అని అన్నారు. ప్రతి విద్యార్థికీ 5 లక్షల విద్య భరోసా కార్డుకు బడ్జెట్లో సున్నా కేటాయింపులు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఊసే లేదు.. ప్రతి మండలానికి ఒకటి అని చెప్పి నేడు నియోజకవర్గానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామని అనడం దానికి బడ్జెట్ కేటాయించకపోవడం దుర్మార్గం.ప్రతి మండలానికి ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు మోసం.
ప్రతి మండలంలో నవోదయ విద్యాలయంతో పాటు సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ కు సిగ్గు చేటు అని అన్నారు.ప్రతి మండల కేంద్రంలో హైస్కూల్ ఇంటర్ కాలేజీ మరియు ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ అదేవిధంగా జిల్లా కేంద్రంలో పీజీ కాలేజీ లను నిర్మిస్తామని చెప్పినారు కానీ బడ్జెట్ మాత్రం సున్నా కేటాయించారు ఎలా సాధ్యమవుతుంది?
3 లక్షల వార్షికో ఆదాయం లోపు ఉన్నవారికి బీసీలకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మోసం.
ఉన్నత చదువులు చదివే వారికి పది లక్షల వరకు రుణాలు ఇస్తామని చెప్పడం మోసం.ఉద్యమంలో చనిపోయిన విద్యార్థి అమరులకు 25వేల పింఛన్ హామీ పచ్చి మోసం. 18 ఏళ్ల పైబడి చదువుకునే విద్యార్థినిలకు ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇస్తామని చెప్పడం దుర్మార్గం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు 10 పాస్ అయితే 10000, ఇంటర్ పాస్ అయితే 15000, డిగ్రీ పాసైతే 25000, పీజీ పాస్ అయితే ఒక లక్ష, పిహెచ్డి ఎంఫిల్ పాస్ అయితే ఐదు లక్షలు ఇస్తా అని చెప్పడం పచ్చి మోసం. యూనివర్సిటీలో చదువుకునే వారికి 10000 వేల ఫెలోషిఫ్ హామీ సున్న. విదేశీ యూనివర్సిటీలో చదువుకునే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సాయం సున్నా.ఫీజు రియాంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు దాదాపు 8 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉంది. వీటన్నిటికీ బడ్జెట్ కేటాయించకుండా విద్యారంగాన్ని అతలాకుతలం చేసినటువంటి మూర్ఖత్వపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్వి నాయకులు బోయ రాజు, సందేశ్,మాధవ్, నరేంద్ర, పవన్,జోయేల్, హరికృష్ణ, రాజు, రమేష్, నాగరాజు, బన్ను, మహేష్ తదితరులు పాల్గొన్నారు.