జనం న్యూస్. మార్చి 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని ముస్లిం మైనార్టీ సోదరులు నూతన వస్త్రాలను ధరించి ఈద్గా వద్దకు చేరుకొని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్-ఉల్-ఫితర్. నమాజ్ అనంతరం రంజాన్ వేడుకలను ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నెల రోజులపాటు కటోరమైన ఉపవాసాలతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో కలిసిమెలిసి ఉండాలని ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించి.అల్లాని వేడుకున్నారు. ఈ సందర్భంగా మజీద్ ఇమామ్ మత బోధకులు బోధిస్తూ రంజాన్ పండుగ ప్రేమ శాంతి సోదర భావానికి ప్రతీక అని తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ అనంతరం అలయ్ బలయ్ తో ఒకరికొకరు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా వద్ద నల్ల బ్యాడ్జీలతో ముస్లిం సోదరుల నిరసన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుమేరకు ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ అనంతరం పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులు తమ చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించి వక్ప్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో.ముస్లింమత పెద్దలు.యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.