జనం న్యూస్ ఏప్రిల్ 01 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరునియోజకవర్గం
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సర్వే నెంబర్ 993లో గోశాల పక్కనగల ప్రభుత్వ భూమిలో గవర్నమెంట్ బస్తీ దవాఖానా కొరకు కేటాయించిన స్థలంలో కొందరు అక్రమార్కులు యదేచ్ఛగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో ఈ స్థలాన్ని బస్తీ దవాఖాన కేటాయించిన క్రమములో బస్తీ దవఖాన కి సంబంధించిన ప్రభుత్వ స్థలంలో కొంతమంది కబ్జాలు చేసి యధేచ్ఛగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు.గతంలో కూడా ఈ అక్రమ నిర్మాణాలపై రెవిన్యూ అధికారులు కూల్చివేతలునిర్వహించినప్పటికి మళ్లీ రాత్రికి రాత్రి నిర్మాణలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ అక్రమ కట్టడాలను నిర్వహించిన వారి పై తగిన చర్య తీసుకోగలరనీ ప్రజల కోరుతున్నారు.