పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం
పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది: పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా
జనం న్యూస్, ఏప్రిల్ 3, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో 51మంది కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ లుగా పదోన్నతి పొందిన అధికారులకు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా వారి కార్యాలయంలో అభినందింఛి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నంను అలకరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…. పదోన్నతులతోనే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం వస్తుందని ఎలాంటి రిమార్క్ లేకుండా మిగిలిన సర్వీసును పూర్తి చేసి విధుల్లో మంచి పనితీరు కనబరిచి మరిన్ని పదోన్నతులు పొందాలని అన్నారు. పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని సీపీ అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని, ఇప్పటివరకు ఎలాంటి క్రమశిక్షణతో విదులు నిర్వహించారో అదేవిధంగా మిగతా సర్వీస్ పూర్తి చేసి మరిన్ని పదోన్నతులు పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటాం, మానసికంగా శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని, మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా సీపీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఎఓ శ్రీనివాస్ , ఆర్ ఐ శ్రీనివాస్, సూపరిండెంట్ లు సందీప్ ,మనోజ్ కుమార్ ,సిసి హరీష్ తదితరులు పాల్గొన్నారు.