ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సన్న బియ్యం పంపిణీ చేసిన గట్టుపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లి సామేల్
జనం న్యూస్ 07 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు )
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం గట్టుపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బొల్లి సామేల్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం సన్న బియ్యాన్ని గ్రామ ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బొల్లి సామేల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2700 కోట్ల అదనపు భారాన్ని భరించి ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇచ్చే నిర్ణయం దేశంలోనే చారిత్రాత్మకమైన కార్యక్రమంగా అభివర్ణించారు. పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. అణ గారిన బడుగు బలహీన వర్గాల దళిత గిరిజన బిస్సి మైనార్టీ ప్రజలకు ఆహార భద్రత కల్పించాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంకల్పం అన్నారు. ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సదక్, మంజుల, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల అబ్రహం, మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.