జనం న్యూస్ ఏప్రిల్ 07 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల
పరిధిలోని గ్రామాల్లో మరియు కోల్వాయి శ్రీ రామాలయంలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని ఆలయాల్లో చలువ పందిర్లు వేసి శ్రీ కోదండ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల విందుగా మండలం లోని గ్రామాల్లో శ్రీ ఆంజనేయ స్వామి భక్తుల మరియు గ్రామప్రజల ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసిన ఆలయ కమిటీ సభ్యులు సీతారామ కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీతారాముల కల్యాణానికి అయ్యా గ్రామాల కమిటీ సభ్యులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తమున భాజా భజంత్రీలు, వేదమంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా వేద పండితులు వొద్దిపర్తి సంతోష్ చార్యులు వోద్దిపర్తి చిన్న సంతొష్ చార్యులు వోద్దిపర్తి మధుకూమార్ చార్యులు లవకుమార్ చార్యులు మంత్రోచ్ఛారణలతో ఘనంగా నిర్వహించారు. స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు సీతారాములకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి కళ్యాణ అనంతరం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమo లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దీంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కోదండ సీతారామ కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.