జనం న్యూస్ ఏప్రిల్ 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణ లో ఈరోజు కాగజ్ నగర సబ్ డివిజన్ చింతలమానపల్లి మండలంలో ని గంగాపూర్ గ్రామ విద్యాలయంలో విద్యార్ధి, విద్యార్థినిలకు షీటీమ్ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్, చింతల మానేపల్లి ఎస్సై నరేష్ షీటీమ్ టీం ఇంచార్జ్ ఎ.ఎస్.ఐ సునీత మాట్లాడుతూ…. మహిళలపై హింస , ఈవ్టీజింగ్ , సైబర్ క్రైమ్ లకు ఎవరైనా గురి అయినట్లయితే వెంటనే షీటీం ను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల అయినా ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిని వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన గుడ్ టచ్.మరియు బ్యాడ్ టచ్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా జిల్లాలోని మహిళలకు రక్షణ కల్పించడం కోసమే షీ టీం , పనిచేస్తున్నాయని, అలాగే ఏదైనా అత్యవసర సమయంలో డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు..