మెదక్ ఆర్డీవో రమాదేవి
జనం న్యూస్ 2025 జనవరి 16 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)...గురువారం మెదక్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపికకు కసరత్తును ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో జరుగుతోన్న సర్వే సరళిని పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న నిరుపేదలను గుర్తించాలని, భూములు, ఆదాయం, వంటి వివరాలను తప్పులు లేకుండా ఫార్మ్ లో నమోదు చేయాలని ఆదేశించారు.
ఈ సర్వేలో భాగంగా విచారణలో తేలిన వివరాల ఆధారంగా అర్హుల జాబితాను రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఆర్ ఐ లక్ష్మణ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు