ఆహ్వానం100కిలోల తలంబ్రాలను ప్రకటించిన భద్రాచల
దేవస్థానంకోటి తలంబ్రాల దీక్షలో గ్రామ, గ్రామాన
ఉప్పొంగిన రామభక్తి
జనం న్యూస్, ఏప్రిల్ 11( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)భద్రాచల దేవస్థానం గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ సేవను గుర్తించి మూడోసారి అప్పగించిన కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం 45రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా నిర్వహించి భద్రాచల సీతారాముల కల్యాణనికీ 250కిలోల గోటి తలంబ్రాలు అందించారు.సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలను 100కిలోలు రామకోటి సంస్థకు ఇవ్వనున్నట్లు భద్రాచలం ఆహ్వానం పంపిందని సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు గారు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ముత్యాల తలంబ్రాలను తీసుకొచ్చి కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొన్న వేలాది భక్తులకు అందిస్తానని తెలిపారు.