( డి.ఎస్.పి) జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు మహారాజ్
జనం న్యూస్, ఏప్రిల్ 12 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ ల ఆధ్వర్యంలో ఏప్రిల్ 14వ తేదీన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభం కానున్న విశారదన్ మహారాజు,ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ధర్మ సమాజ్ పార్టీ దుబ్బాక మండల కమిటీ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది.ఆవిష్కరణ అనంతరం ధర్మసమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు మహరాజ్ మాట్లాడుతూ తెలంగాణ గడ్డమీద 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, అనగారిన వర్గాల ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని కలిగించి, రాజ్యాధికారాన్ని సాధించడం కోసమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ మరియు ధర్మసమాజ్ పార్టీ ల సంయుక్త ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్రకి శ్రీకారం చుట్టడం జరిగిందని, ఈ రథయాత్ర ఏప్రిల్ 14వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్, జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమై మూడు సంవత్సరాల మూడు నెలల పాటు 33 జిల్లాల మీదుగా కొనసాగి ప్రజా సమస్యల మీద పోరాడుతూ అణగారిన వర్గాల రాజ్యాధికార లక్ష్యం దిశగా సాగుతుందని అన్నారు. ఈ యాత్రని విజయవంతం చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ,ఎస్సీ, ఎస్టీ, అనగారిన వర్గాల ప్రజలు, మేధావులు, బుద్ధి జీవులు, ప్రజాస్వామ్యవాదులు, అగ్రకులాల్లో ఉన్న పేదలు అందరూ కలిసి రావాలని ఏప్రిల్ 14 ఆదిలాబాద్ లో జరిగే ప్రారంభ సభని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ మండల అధ్యక్షులు కనకరాజు,మండల నాయకులు ప్రభాకర్, సాయి,రాజు తదితరులు పాల్గొన్నారు.