జనం న్యూస్ ఏప్రిల్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
శ్రీ మణికంఠ సేవసమితి ఆద్వర్యంలో పంచమి కాలనీ శ్రీ మరెమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన ఉత్తరణక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ అయ్యప్పస్వామి జన్మదిన సందర్బంగా మహపడిపూజ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిధులుగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు , జిల్లా గణేష్, నర్సింగ్ యాదవ్, సతీష్ రావు, తెల్ల హరికృష్ణ, వి రాకేష్, వి కళ్యాణ్, సురభి రమేష్ రావు, మంజుల యాదవ్, అమూల్య తదితరులు అయ్యప్ప స్వామిని దర్శించుకొని తదనంతరం పల్లకి ఊరేగింపు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీ మణికంఠ సేవసమితి కమిటీ సభ్యులు, శ్రీ మరెమ్మ తల్లి దేవాలయ కమిటీ అభ్యులు, మహిళలు, భక్తులు, అధికసంఖ్యలో పాల్గోని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకర్ణిచం జరిగినది.