జనం న్యూస్ // ఏప్రిల్ // 13 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)
జమ్మికుంట పట్టణంలోని కృష్ణ కాలనీలో శనివారం,గుల్లి రమ-రాములు, మారేపల్లి లక్ష్మీ -దేవేందర్ల సౌజన్యంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల అజయ్ గౌడ్, 27వ వార్డు అధ్యక్షుడు దొడ్డే నవీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైస మహేందర్లు మాట్లాడుతూ.. బాలవికాస ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమంలో భాగంగా బాటసారుల, యొక్క దాహార్తి తీర్చేందుకు, బాలవికాస సంస్థ మహిళలు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు.ఇలాంటి సేవాభావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకొని, ఈ వేసవిలో పట్టణంలో, వాడవాడకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన, కోఆర్డినేటర్ కే సుమలత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.