జనం న్యూస్ 14 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
రక్తదానం ప్రాణదానంతో సమానమని , ప్రతి ఒక్కరూ రక్తదానంపై అపోహలు వీడి రక్తదానానికి ముందుకు రావాలని విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్.ఇల్తామాష్ కోరారు. పట్నంలో బీసీ కాలనీలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు బిశెట్టి బాబ్జి పాల్గొని రక్తం శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లాలో వేసవికాలం రక్తం నిల్వలు కొరత కారణంగా తలసేమియా పిల్లలు , గర్భిణి స్త్రీల కొరకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్.ఇల్తామాష్ తెలిపారు . ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిశెట్టి బాబ్జి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం తో సమానం అని, ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన అందరూ కూడా రక్తదానం చేయొచ్చని, తెలియజేశారు, అత్యధిక సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త నిల్వలు కొరత జిల్లాలో తీరుస్తున్నారని విజయనగరం యూత్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనియాడారు.ఈ రక్తదాన శిబిరంలో 30 మంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేయడం వల్ల ముగ్గురు ప్రాణాలు కాపాడొచ్చు అని తెలియజేశారు, రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.సేకరించిన రక్త నిల్వలు విజయ బ్లడ్ బ్యాంక్ కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులు రాయల్ క్యాబ్స్ శరత్, అశోక్, సాయి కుమార్, ఎన్. రఘు, రాము, పి. రఘు, సాయి ప్రసాద్, వినయ్, విజయ్ కాంత్, కళ్యాణ్, విజయ్, శివ వర్మ, విజయ బ్యాంక్ మేనేజర్ పుణ్యమంతుల శివ తదితరులు పాల్గొన్నారు.