జనం న్యూస్;14 ఏప్రిల్ సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;వై రమేష్ ;
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తూ భారతావని ముందుకు సాగాలని ఎస్టియు జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్, ప్రధాన కార్యదర్శి మ్యాడ శ్రీధర్ లు అన్నారు బాబు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సందర్భంగా (ఏప్రిల్ 14) సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విగ్రహానికి పూలమాలవేసి మాట్లాడుతూ అణగారిన వర్గాల ప్రగతికై అహర్నిశలు కృషి చేసిన మహానీయులు అంబేద్కర్ బాటలో సాగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర బాధ్యులు మట్టపల్లి రంగారావు, రవీందర్ రెడ్డి, ఖాత యాదగిరి, లింగారెడ్డి, ఉండ్రాళ్ల రాజేశం, లింగ శ్రీనివాస్ , రాములు, హరిదాస్, సంపత్ కుమార్, వెంకటేశం, రవీందర్, జనగామ శ్రీనివాస్, వేణుగోపాల్, బస్వ రాజ్ కుమార్, రాజేశం, నీలం గురవయ్య, కాటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.