జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుర్గా కాలనీకి చెందిన పురం శెట్టి తిరుపతి(40) అనే వ్యక్తి ని డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ మీదుగా టీఎస్ 25 టి2940 అనే నెంబర్ గల డీసీఎం వ్యాన్ లోడుతో ఫ్లైఓవర్ ఎక్కుతుండగా ఆ పక్క నుండే ఎలక్ట్రిక్ బైక్ పై వెళ్తున్న తిరుపతిని ప్రమాదవశాత్తు ఢీకొనడంతో టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య సృజనతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రవి పేర్కొన్నారు.