జనం న్యూస్ ఏప్రిల్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు శ్రీ ప్రభాకర్ రావు అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణ లో కాగజ్నగర్ టౌన్ జిల్లా ప్రజా పరిషత్తు పాఠశా పెట్రోల్ పంప్ లో షీటీమ్ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షీటీమ్ టీం ఇంచార్జ్ ఎ ఎస్ ఐ సునీత మాట్లాడుతూ…. మహిళలపై హింస , ఈవ్టీజింగ్ , సైబర్ క్రైమ్ లకు ఎవరైనా గురి అయినట్లయితే వెంటనే షీటీం ను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల అయినా ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిని వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన గుడ్ టచ్.మరియు బ్యాడ్ టచ్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా జిల్లాలోని మహిళలకు రక్షణ కల్పించడం కోసమే షీ టీం , పనిచేస్తున్నాయని, అలాగే ఏదైనా అత్యవసర సమయంలో డయల్ 100కు కాల్ చేయాలని పేర్కొన్నారు. , షీ టీం నెంబర్ 87126 70565 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ 1930 సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రాజయ్య ప్రిన్సిపల్ మరియు మరియు ఉపాధ్యాయులు సిబ్బంది షీ టీం సభ్యులు బి.రమదేవి, బి శ్రీనివాస్ ఈ .సునీత , పాల్గొనడం జరిగింది.