జనం న్యూస్ ఏప్రిల్ 21 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం శీలం పల్లి రైతు వేదికలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా రైతుల భూ సమస్యలను తీర్చే చట్టమే భూ భారతి చట్టం అని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణ భూ భారతి- 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా సోమవారం మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల కేంద్రంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు గ్రంధాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి, ఆర్డిఓ మహిపాల్ రెడ్డి, తాసిల్దార్ సింధుజ, ఎంపీడీవో ఆనంద్, ఏ డి ఏ పద్మ సంబంధిత అధికారులు రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా భూ భారతి చట్టంపై రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి సందేశం, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సందేశం, రెవిన్యూ, గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు సందేశం రైతులకు వినిపించారు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు భూభారతి చట్టంపై కళా ప్రదర్శనలు రైతులను ఆకట్టుకున్నాయి భూభారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ భారతి భారతి ద్వారా సాగులో ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని
తెలిపారు. సమస్యల పరిష్కారానికై రాష్ట్రంలోని 4 మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకోవడం జరిగిందని, ఈ నెలాఖరునాటికి ఈ పైలెట్ ప్రాజెక్టు పూర్తవుతుందని, జూన్ 2 నుండి ఈ పైలెట్ మండలాలలో వ్యవసాయ భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించనున్నామని తెలిపారు. జూన్ 2 నుండి ప్రతి గ్రామానికి తహసిల్దార్ స్థాయి అధికారులు గ్రామానికి వచ్చి భూ సమస్యల పై దరఖాస్తులు తీసుకుంటారని, రైతులు ఒక రూపాయి కూడా చెల్లించకుండా రెవెన్యూ సమస్యలను అతి తొందరలో న్యాయం చేస్తానని తెలిపారు శాటిలైట్ ద్వారా భూ సమస్య ప్రక్రియను కొనసాగించడం జరుగుతుందని తెలియజేశారు