జనం న్యూస్ ఏప్రిల్ 26 చిలిపి చెడు మండల ప్రతినిధి : మెదక్ జిల్లా చిలిపిచేడు మండల పరిధిలోని ఫైజాబాద్ గ్రామంలో శనివారం నర్సరీని పరిశీలించారు. ఉపాధి హామీ ఈ సీ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజు నీరు పెట్టాలని సూచించారు అంతేకాకుండా అన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. గ్రామలో ఫీల్డ్ అసిస్టెంట్ రవీందర్ కి నర్సరీ చెట్ల పెంపకం గురించి వివరించనైనది రోడ్డు పక్కన మరియు ఇంటింటికి చెట్లు పంపిణీ చేయుటకు వర్షాకాలంలో ఇట్టి మొక్కలు పంపిణీ చేయవలసి ఉన్నందున మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశించి మరియు ఇట్టి నర్సరీలో పండ్ల మొక్కలు రోడ్డుకి ఇరువైపులా పెంచే మొక్కలను తొందరగా జర్మినేషన్ వచ్చే విధంగా ప్రతిరోజు నీరు పట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్ రవీందర్ కి తగు సూచనలు చేసినారు. ఇట్టి కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రవీందర్ ఉపాధి హామీ ఈ సీ భగవాన్ రెడ్డి. టి ఏ హనుమండ్లు వన సేవకు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు